byసూర్య | Wed, May 22, 2024, 11:23 AM
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని దెగుల్ వాడి గ్రామంలో నర్సరీ, తెలంగాణ క్రీడా ప్రాంగణం, అమ్మ ఆదర్శ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణాన్ని ఎంపీడీవో సత్తయ్య మంగళవారం పరిశీలించారు. అనంతరం అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేసి పిల్లల అటెండెన్స్ చూసారు. అంగన్వాడి టీచర్ సెలవు ఉన్నందున ఆయా అంగన్వాడి సెంటర్ ను నడుపుతున్నారని తెలిపారు. వానలు కురిసే సమయానికి మొక్కలను పంపిణీకి సిద్ధంగా ఉంచాలని పంచాయతి కార్యదర్శికి సూచించారు.