![]() |
![]() |
byసూర్య | Wed, May 22, 2024, 10:19 AM
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శివాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు బుధవారం నిత్యాభిషేకంలో భాగంగా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఎర్రకేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పరమశివుడు భక్తులకు దివ్యదర్శనంలో దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజ నిర్వహించారు.