byసూర్య | Tue, May 21, 2024, 09:28 PM
భిక్కనూరు శ్రీ సిద్ధరామేశ్వరాలయంలో చేపడుతున్న వాస్తు దోష నివారణ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటగా ఆలయంలోని మూలవిరాట్ స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు నివారణ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు నాలుగు వేదాల పారాయణం మొదలు కావడం జరిగింది. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో అడ్వకేట్ రాంరెడ్డి దంపతులు పాల్గొన్నారు.