![]() |
![]() |
byసూర్య | Tue, May 21, 2024, 09:18 PM
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడఫ్గల్ గ్రామ శివారులోని జాతీయ రహదారి ప్రక్కన బారడి పోశమ్మ గుడి వెనకాల బోయిని కిష్టయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలి వద్దకు చేరుకున్నారు. అతని తలపై బలమైన గాయం ఉండడంతో మృతి పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యనా..? లేదా ఇంకేమైనా జరిగిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.