అన్నదాతల్లో కొత్త ఆశలు.. ఆ విత్తనాలకు ఫుల్ డిమాండ్, గతేడాది కంటే రెట్టింపు

byసూర్య | Tue, May 21, 2024, 09:16 PM

తెలంగాణలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతన్నలు సాగుకు సిద్ధమవుతున్నారు. జూన్ తర్వాత తొలకరి పలకరించగానే.. విత్తనాలు విత్తేందుకు భూమిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విత్తన సేకరణ మెుదలుపెట్టారు. గతేడాది కొన్ని పంటలకు రికార్డు ధర పలకటంతో రైతులు ఈసారి ఆయా సాగులవైపు మెుగ్గుచూపుతున్నారు.


తెలంగామలో నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యధికంగా పసుపు పంటను సాగు చేస్తున్నారు. అయితే అధిక ఖర్చుతో కూడుకున్న ఈ పంటకు కొన్నేళ్లుగా మార్కెట్లలో ఆశించిన ధర రాలేదు. మరోవైపు తెగుళ్ల బాధ.. పెట్టుబడి సైతం చేతికందక సాగు విస్తీర్ణాన్ని కొందరు తగ్గించారు. మరి కొందరు అయితే పూర్తిగా ఈ సాగును మానుకున్నారు కూడా. దాదాపు ఏడేళ్ల తర్వాత ఈసారి పసుపు రికార్డు ధర పలికింది. క్వింటాకు రూ.11 వేలకు పైగా ధర పలుకుతుండడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.


ఈసారి పసుపు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సాగు విస్తీర్ణం రెట్టింపయ్యే అవకాశం ఉండడంతో విత్తన పసుపునకు మార్కెట్‌లో డిమాండ్‌ భారీగా పెరిగింది. గతేడాది వరకు క్వింటా విత్తన పసుపు రూ.1500 వరకు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.3 - రూ.5,500 పలుకుతోంది. ప్రతి ఎకరానికి 8-10 క్వింటాళ్ల విత్తన పసుపు అవసరం అవుతుంది. విత్తన పసుపు కొనుగోలు చేయడానికి చాలా మంది రైతులు ఆసక్తి చూపుతున్నా ప్రస్తుతం మార్కెట్‌లో దొరకడం లేదు. విత్తన పసుపు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు వ్యవసాయ అధికారులను కోరుతున్నారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM