చేపల కోసం ఎగబడ్డ జనాలు.. దెబ్బకు చెరువంతా ఖాళీ.. పోలీసులను కూడా లెక్కచేయకుండా

byసూర్య | Tue, May 21, 2024, 08:24 PM

సాధారణంగా.. గ్రామాల్లో ఉన్న చెరువుల్లోని చేపలను మత్సకారులు పట్టుకుని.. అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. అయితే.. చెరువుల్లోని చేపలను అప్పుడప్పుడు మిగతావాళ్లు కూడా పట్టుకుంటారు. కానీ.. ఏదో గాలంలాంటివి వేసి ఒకటో రెండో చేపలు పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. పట్టుకోవచ్చు కదా అని వలలు వేయనీయరు. అదో నియమం ఉంటుంది. కానీ.. ఈ గ్రామంలో మాత్రం ఊరు ఊరంతా వలలు పట్టుకుని.. చెరువు మీద దండయాత్ర చేశారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న చెరువును కదనరంగం చేసేశారు. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని అన్నట్టుగా.. చేపలు పట్టుకుపోయారు. ఆపడానికి పోలీసులను కూడా లెక్కచేయకుండా చెరువు మొత్తం లూటీ చేశారు. ఒక్కసారిగా ఊరి జనాలంతా దండెత్తటంతో.. చెరువు మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ ఘటన.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నెరడ గ్రామంలో జరిగింది.


గ్రామంలోని పెద్ద చెరువులో ఎప్పటిలాగే మత్స్యకారులు చేపలు పడుతుండగా.. వేల సంఖ్యలో గ్రామస్థులంతా ఒక్కసారిగా చేపలు పట్టేందుకు తరలివచ్చారు. దీంతో.. ఆ చెరువంతా పుష్కరాన్ని తలపించింది. ఒక్కసారిగా ఎగబడ్డ గ్రామస్తులు.. వలలతో చెరువులో దిగి లూటీ చేశారు. దొరికినోళ్లకు దొరికినన్ని చేపలు పట్టుకుని అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందజేయగా.. హుటాహుటిన చెరువు దగ్గరికి చేరుకున్నారు. గ్రామస్థులను ఆపేందుకు ఎంతగా ప్రయత్నించినా.. వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులను ఏ మాత్రం లెక్క చేయకుండా గ్రామస్థులంతా చేపల వేటలో నిమగ్నమయ్యారు.


అయితే.. పెద్ద చెరువు లూటీ అవడం ఇది మొదటిసారేం కాదు. మూడో సారి అని కొందరు గ్రామస్థులు చెబుతున్నారు. మృగశిర కార్తె సమీపిస్తున్న వేళ.. గ్రామస్థులకు ఈ చెరువుపై హక్కు ఉంటుందని తెలిపారు. అందుకే ఇక్కడ గ్రామస్థులు చేపలు పట్టుకుంటున్నారని వివరించారు. అయితే.. చెరువును లూటీ చేయడానికి గ్రామస్థలకు హక్కు ఉంటుందని.. ఈ క్రమంలో గొడవలు జరగలేదన్నారు. అయితే.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


గతంలో కూడా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లి గ్రామంలోని చెరువులో కూడా ఇలాగే జరిగింది. మత్స్యకారులు చేపలు పడుతున్న సమయంలో.. వేలాదిగా తరలివచ్చిన గ్రామస్థులు చేపలను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మత్స్యకారులకు, గ్రామస్థులకు ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సద్ధుమణిగేలా చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. పోలీసుల మాటలను ఏమాత్రం లెక్కచేయకుండా.. తోసుకుంటూ వెళ్లి మరీ చేపలను పట్టుకున్నారు. వేలాదిగా వచ్చిన గ్రామస్థులను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు.


Latest News
 

అసెంబ్లీ లో హరీష్ రావు Vs బట్టి విక్రమార్క Sat, Jul 27, 2024, 01:23 PM
రేపు వైన్స్ బంద్.. ఎందుకంటే ? Sat, Jul 27, 2024, 12:51 PM
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షునిగా నక్క రమేష్ Sat, Jul 27, 2024, 12:23 PM
తాము మాట్లాడుతుంటే చూపించడం లేదన్న హరీశ్‌రావు Sat, Jul 27, 2024, 12:11 PM
సుంకేసుల జలాశయానికి భారీగా వరద నీరు Sat, Jul 27, 2024, 11:21 AM