byసూర్య | Tue, May 21, 2024, 07:40 PM
తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకురావడం తప్పుడు ప్రచారమని కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, రాష్ట్రంలో లిక్కర్ కొరత లేకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు వారికి అనుకూల పత్రికలలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.