![]() |
![]() |
byసూర్య | Tue, May 21, 2024, 07:38 PM
వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, మున్సిపల్ ఛైర్మన్ పుట్టపాకుల మహేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అణగారిన బతుకులలో వెలుగులు నింపి ఆఖరి క్షణం వరకు దేశం కోసమే బ్రతికిన మహనీయుడని రాజీవ్ గాంధీని కొనియాడారు.