కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలు వదిలిపెట్టారు : కేటీఆర్

byసూర్య | Tue, May 21, 2024, 01:59 PM

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు.ఇది కపట కాంగ్రెస్ మార్క్ మోసమని కేటీఆర్ దుయ్యబట్టారు.అధికారంలోకి రాకముందు ప్రతి గింజకు బోనస్ అని ఊదరగొట్టి ప్రభుత్వం రాగానే చేతులేత్తేస్తారా అని నిలదీశారు.కాంగ్రెస్ ది ప్రజా పాలన కాదన్న కేటీఆర్ రైతు వ్యతిరేక పాలన అంటూ విమర్శించారు. ఓట్ల నాడు ఒక మాట.. నాట్ల నాడు మరో మాట చెప్పడంతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు. తమ గొంతు నొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలు వదిలిపెట్టరని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కార్ కు కౌంట్ డౌన్ షురూ అయిందని తెలిపారు.


 


 


Latest News
 

కొత్త రేషన్ కార్డుల సర్వే వేళ కన్ఫ్యూజన్.. పాతవి తొలగిస్తారా..? మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ Fri, Jan 17, 2025, 08:15 PM
పుష్ప సినిమా చూసి,,, హీరో స్మగ్లింగ్ చేసే పద్ధతి చూసి,,,హైదరాబాద్ డ్రగ్స్ స్మగ్లింగ్ Fri, Jan 17, 2025, 07:52 PM
నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం.. 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ Fri, Jan 17, 2025, 07:47 PM
ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమే.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ఆదేశాలపై హరీష్ రావు ఇంట్రెస్టింగ్ ట్వీట్ Fri, Jan 17, 2025, 07:41 PM
సింగపూర్‌తో రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం.. ఓపినింగే అదిరిపోయిందిగా Fri, Jan 17, 2025, 07:36 PM