![]() |
![]() |
byసూర్య | Tue, May 21, 2024, 12:37 PM
హైదారాబాద్లోని బొల్లారం కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం చోటు చేసుకుంది. మంగళవారం చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా ప్రాంగణంలోని చెట్టు విరిగి దంపతులపై పడింది. ఈ ప్రమాదంలో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.