![]() |
![]() |
byసూర్య | Tue, May 21, 2024, 12:24 PM
విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకొని ప్రణాళికతో చదువుతూ ముందుకు వెళ్లాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రితి రాజ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవ తరగతి, ఇంటర్ పాసైన పోలీస్ సిబ్బంది, అధికారుల కుటుంబాలకు చెందిన పిల్లలతో సమావేశం నిర్వహించారు. జీవితంలో లక్ష్యసాధనకు అనుసరించాల్సిన విధివిధానాల గురించి వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు మహనీయుల పుస్తకాలు అందజేశారు.