హైదరాబాద్‌లో వెలుగులోకి మరో భారీ మోసం.. 200 కోట్లతో గాయబ్.. ఆమెదే కీలక పాత్ర

byసూర్య | Mon, May 20, 2024, 05:33 PM

తెలంగాణలో ఇప్పటికే పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపడుతుంటే.. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌లో మరో కుంభకోణం వెలుగుచూసింది. ఇందులో ఏకంగా 200 కోట్లతో నిందితులు గాయబ్ అయినట్టు తెలుస్తోంది. కష్టపడి సంపాధించిన డబ్బులో పదో పరకో దాచుకోవాలనుకున్న సామాన్యులకే లక్ష్యంగా చేసుకుని.. అధిక వడ్డీల ఆశజూపి.. డిపాజిట్లు చేపించుకుని నిలువునా ముంచేసి బోర్టు తిప్పేసింది.. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ. ఈ కుంభకోణంలో ఓ బ్యాంకులో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న మహిళే కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.


నగరంలోని అబిడ్స్‌లో ఉన్న ఓ ప్రభుత్వ బ్యాంక్‌లో పని చేస్తున్న జనరల్ మేనేజర్‌.. తన భర్తతో బ్యాంకు సమీపంలో శ్రీ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ ఓపెన్ చేపించింది. తమ బ్యాంక్‌కు వచ్చి డబ్బు డిపాజిట్ చేయాలనుకున్న వినియోగదారులను ఆకర్షించి.. అధిక వడ్డీ ఇప్పిస్తానంటూ వాళ్లందరినీ తన భర్త ఆఫీస్‌కు పంపించింది. తమ దగ్గర పెట్టుబడి పెడితే మార్కెట్‌లో ఉన్న వడ్డీ రేటు కంటే అధికంగా చెల్లిస్తామని నమ్మబలికి.. డిపాజిట్ల రూపంలో డబ్బులు వసూలు చేసింది ప్రియాంక ఎంటర్‌పైజెస్ యాజమాన్యం.


అంతేకాకుండా.. సంస్థ నుంచి ఏజెంట్లను కూడా నియమించుకుని మొత్తంగా 517 మంది దగ్గరి నుంచి ఏకంగా రూ.200 కోట్ల మేర డిపాజిట్లను సేకరించింది. కాగా.. ఇప్పుడు రాత్రికి రాత్రే అందిన కాడికి దండుకుని సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. దీంతో.. మోసపోయామని గ్రహించిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బషీర్‌బాగ్ సీసీఎస్ పీఎస్ వద్ద ఆందోళన చేపట్టారు. దాదాపు 517 మంది ఇప్పటి వరకు శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో డిపాజిట్లు చేసినట్లుగా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.


Latest News
 

తెలంగాణ ఆర్టీసీకి ప్రకటనల పేరుతో 'గో రూరల్ ఇండియా' అనే సంస్థ కోట్లాది రూపాయల మేర టోకరా Fri, Feb 14, 2025, 10:10 PM
సహకార సంఘాల కాలపరిమితిని పెంచిన ప్రభుత్వం Fri, Feb 14, 2025, 10:09 PM
దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న మంద కృష్ణ Fri, Feb 14, 2025, 10:07 PM
బీసీ కులగణన,ఎస్సి వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయాలు : నీలం మధు ముదిరాజ్.. Fri, Feb 14, 2025, 09:31 PM
సంగారెడ్డిలో ఐఐటీ పెట్టాలనుకున్నాం: జగ్గారెడ్డి Fri, Feb 14, 2025, 09:28 PM