![]() |
![]() |
byసూర్య | Mon, May 20, 2024, 04:18 PM
జన్నారం మండలంలోని పైడిపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో నూతన ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నామని ఆలయ అర్చకులు గుండి సత్యనారాయణ శర్మ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ దేవాలయం ఆవరణలో నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మే 25న ఉదయం 11 గంటలకు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అభిషేకం, శ్రీరామ యజ్ఞం, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని, అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.