శ్రీవారి భక్తులకు అదిరే ప్యాకేజీ.. ఒక్కరోజులో తిరుమల టూర్​.. ఫ్రీగా దర్శనం.. పూర్తి వివరాలివే

byసూర్య | Fri, May 10, 2024, 07:22 PM

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు నెలలు ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. అందులోనూ తెలంగాణలో శ్రీవారి భక్తులైతే.. కనీసం నెల రోజుల ముందే రైలు టికెట్లు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దర్శనం టికెట్లు విడుదల చేసినప్పుడు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా నిరాశే ఎదురవుతుంది.. మళ్లీ నెలరోజులు నిరీక్షించాల్సిందే. అయితే.. అలాంటి నిరాశలేమీ ఎదురవకుండా.. తెలంగాణలోని తిరుమల శ్రీవారి భక్తులకు పర్యటక శాఖ అదిరిపోయే ప్యాకేజీని ప్రకటించింది. సాధారణంగా అయితే.. హైదరాబాద్ నుంచి తిరుమల పర్యటనకు వెళ్లాలంటే ఎంతకాదన్నా.. కనీసం 4 రోజులైనా పడుతుంది. అయితే తెలంగాణ పర్యటక శాఖ శ్రీవారి భక్తులకు ఒక్కరోజు టూర్ ప్యాకేజీని అమల్లోకి తీసుకొచ్చింది.


తెలంగాణలోని తిరుమల శ్రీవారి భక్తుల కోసం తీసుకొచ్చిన ఈ "తిరుపతి తిరుమల ప్యాకేజీ" తో.. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ పర్యటన పూర్తి చేసుకోవచ్చు. దీన్ని తెలంగాణ పర్యాటక శాఖ ఆపరేట్ చేస్తుంది. అయితే.. ఈ ప్యాకేజీ ఎంచుకున్న భక్తులు.. బస్సులోనే వెళ్లాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ‌లో ఒక్కొక్కరికీ పెద్దలకైతే టికెట్ ధర 3700 రూపాయలు ఉండగా.. చిన్నారులకు 2960 రూపాయలుగా నిర్ణయించారు. అంతేకాకుండా.. ఈ ప్యాకేజీలో భాగంగా తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. అంతేకాదు.. ఈ ప్యాకేజీలో కేవలం స్వామివారి దర్శనమే కాకుండా.. ఆ ఒక్క రోజులోనే తిరుమల, తిరుపతిలోని ఆలయాలను కూడా కవర్ చేస్తారు.


 తిరుమల టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు..


మొదటి రోజు: సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయల్దేరుతుంది. (సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9848540374)


రెండో రోజు: ఉదయం 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. అక్కడ అల్పాహారం లాంటివి చేసిన తర్వాత స్థానికంగా ఉండే ఆలయాలను దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. అనంతరం తిరుపతికి చేరుకుంటారు. తిరుపతిలో ఉన్న పలు ఆలాయాలను దర్శించుకున్న తర్వాత.. సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.


మూడో రోజు: ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.


తెలంగాణ టూరిజం బస్సు ప్యాకేజీలో టిక్కెట్లు బుక్ చేసుకున్న యాత్రికులందరూ తెలంగాణ టూరిజం బస్సులో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది.



Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM