byసూర్య | Fri, May 10, 2024, 04:03 PM
జైపూర్ మండలం ఇందారం రైల్వేట్రాక్ సమీపంలోని చెట్లపొదల్లో వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇందారం గ్రామానికి చెందిన పగిల్ల కొండమ్మ భర్త మరణించడంతో మంచిర్యాలలోని రెడ్డి కాలనీలో కుమారుడు యాదగిరి వద్ద ఉంటోంది. ఈ నెల 2న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోగా కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు.