byసూర్య | Fri, May 10, 2024, 04:00 PM
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మే 13న ఎన్నికలు ఉన్నందున పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని శుక్రవారం రామగుండం సీపి శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిదిలోని అసెంబ్లీ నియోజకవర్గంలలో ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు శనివారం సాయంత్రం 6నుండి మే 13సోమవారం సాయంత్రం వరకు 144సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ తెలిపారు.