byసూర్య | Fri, May 10, 2024, 11:33 AM
దేశంలో ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ నాయకులు మహేష్ గౌడ్ అన్నారు. కంది మండలంలోని ఉపాధి హామీ కూలీలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలి రేట్లు పెంచుతామని చెప్పారు. బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.