byసూర్య | Fri, May 10, 2024, 11:24 AM
నారాయణపేట పట్టణంలోని జిల్లా బిసి సంక్షేమ శాఖ కార్యాలయంలో శుక్రవారం బసవ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. జిల్లా అధికారి కృష్ణమాచారి బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడి సేవలను కొనియాడారు. ఆయన నడిచిన బాటలో మనమందరం నడవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్, వీరశైవ లింగాయత్ సమాజం పెద్దలు పాల్గొన్నారు.