byసూర్య | Thu, May 09, 2024, 02:32 PM
పెద్దపల్లి మండలం బొంపల్లి, గుర్రంపల్లిలో గురువారం బిజెపి నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం దేశంలో అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్ యాదవ్, మండల అధ్యక్షుడు మేకల శ్రీనివాస్ యాదవ్, వేల్పుల రమేష్, పడాల శ్రీధర్ పాల్గొన్నారు.