byసూర్య | Thu, May 09, 2024, 02:33 PM
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం బాచుప్పల గ్రామానికి చెందిన 200 బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.