byసూర్య | Thu, May 09, 2024, 02:14 PM
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ది చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం తుర్కయంజాల్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ ప్రభుత్వాలు ప్రజాపాలనను ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. మోడీని కూడా ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. అత్యధిక మెజార్టీతో తనను గెలిపిస్తే అభివృద్ది చేసి రుణం తీర్చుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.