byసూర్య | Thu, May 09, 2024, 01:58 PM
నడిగూడెం మండల కేంద్రంలో గురువారం రామాలయంలో రఘువీర్ రెడ్డి విజయాన్ని కోరుకుంటూ స్థానిక నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడప, గడప కు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మేనిఫెస్టోను ఓటర్ లకు వివరించారు. సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీటీసీ గుండు శ్రీనివాస్, వేపూరి సుధీర్ , గుండు శ్రీనివాస్, కాసాని వెంకన్న, గడ్డం మల్లేష్, గుండు విజయ రామారావు ఉన్నారు.