'పిరమైన ప్రధాని మోదీ గారూ.. రెచ్చగొట్టే రాజకీయాలకు ఇక్కడ ఓట్లు పడవు'

byసూర్య | Tue, May 07, 2024, 09:00 PM

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. పోలింగ్‌కు మరో ఆరు రోజులు మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన సభల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. 'పిరమైన ప్రధాని మోదీ గారు.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి. దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి.ట అంటూ ట్వీట్ చేశారు.


అదే సమయంలో ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. 'ప్రధానిగా పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి. ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు. ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పండి. మా యువతకు ఉపాధినిచ్చే.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో చెప్పండి. మా ఏజెన్సీ బిడ్డలకు బతుకు దెరువునిచ్చే.. బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఎందుకు బొందపెట్టారో చెప్పండి. మా నవతరానికి కొండంత భరోసానిచ్చే.. ఐటీఐఆర్, హైదరాబాద్ ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో చెప్పండి. తమ పిల్లల బంగారు భవితపై ఆశలు పెట్టుకున్న.. లక్షలాది తల్లిదండ్రుల ఆశయంపై ఎందుకు నీళ్లు జల్లారో చెప్పండి.


తెలంగాణకు ఒక్క నవోదయ, ఒక్క మెడికల్ కాలేజీ.. ఒక్క నర్సింగ్ కళాశాల, ఒక్క ఐఐటీ, ఒక్క ట్రిపుల్ ఐటీ.. ఒక్క ఐఐఎం, ఒక్క ఐసర్, ఒక్క ఎన్.ఐ.డీ. ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని.. మా రైతులపై ఎందుకు పెత్తనం చేస్తున్నారో చెప్పండి. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండినా..200కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. కాంగ్రెస్ సర్కారు పాపానికి నేతన్నలు బలైపోతున్నా. తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదో చెప్పండి. చేనేత రంగంపై జీఎస్టీ వేసి.. మగ్గానికి ఎందుకు మరణశాసనం రాశారో చెప్పండి. తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమలను..బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు తన్నుకుపోతున్నారో చెప్పండి.


మండిపోతున్న నిత్యవసర ధరలను.. ఎందుకు అదుపు చేయలేకపోయారో చెప్పండి. ముడి చమురు ధరలు తగ్గినా.. మోడీ హయాంలో పెట్రోల్, డీజీల్l ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పండి. భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు.. మీరిచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందో చెప్పండి. సబ్ కా సాత్, అచ్చే దిన్ లాంటి నినాదాలు.. ఎందుకు విధానాలుగా మారలేదో చెప్పండి. మీ పాలనలో పదేళ్లు గడిచినా.. ఇంకా ఉచిత రేషన్ పథకం కింద 80 కోట్ల పేదలు ఎలా ఉన్నారో చెప్పండి. అవినీతిపరులకు మీ పార్టీలో ఆశ్రయమిచ్చి.. రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను.. ఎందుకు ప్రయోగిస్తున్నారో చెప్పండి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన.. భారత రాజ్యాంగంపై ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి.. అదే రాజ్యాంగాన్ని అందరి కళ్లముందే కాలరాయకండి. దేశ ప్రధాన మంత్రిగా.. ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా.. ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేయకండి. దేశం కోసం ఏదైనా “విజన్” ఉంటే చెప్పండి. కానీ.. దయచేసి సమాజంలో “డివిజన్” మాత్రం సృష్టించకండి. చివరగా ఒక మనవి. రెచ్చగొట్టే రాజకీయాలకు.. ఇక్కడ ఓట్లు పడవు. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డ.' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.


Latest News
 

హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM
నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు,,,ఉప్పల్ లో సన్ రైజర్స్ మ్యాచ్ Sun, May 19, 2024, 07:34 PM