byసూర్య | Tue, May 07, 2024, 02:49 PM
మెదక్ జిల్లాలోని పొతన్ శెట్టిపల్లి గ్రామ శివారులోని మంజీరా నదిలో స్నానానికి దిగి ఒక బాలుడు మృతి చెందారు. కౌడిపల్లి మండలం సదాశివపల్లికి భూమేష్ అతని భార్య, ఇద్దరు పిల్లలు రాజు, దుర్గేష్ (16)లతో కలిసి స్నానం చేయడానికి మంజీరా నదిలో దిగారు. పెద్ద కుమారుడు దుర్గేష్ ఈత రాక నీటిలో మునిగిపోయి చనిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.