byసూర్య | Tue, May 07, 2024, 02:47 PM
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో మంగళవారం బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకు మద్దతుగా నిర్వహించిన ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో మన ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ అభ్యర్థి ని గెలిపిస్తే జరిగే అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు.