byసూర్య | Sat, May 04, 2024, 02:36 PM
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని నేరేడుగం గ్రామంలో బిఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జోరుగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజుల ఆశిరెడ్డి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న జిల్లా సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఓటు వేసి గెలిపించాలని కోరారు. మండల అధ్యక్షుడు ఎంపిటిసి ఎల్లారెడ్డి, ఖాజన్ గౌడ్, హనుమంతు, ఈశ్వర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.