byసూర్య | Sat, May 04, 2024, 02:33 PM
పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోటలో నిర్వహించనున్న రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేటలో బహిరంగ సభ తర్వాత మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని కొత్తకోటలో సాయంత్రం 4: 00 గంటలకు నిర్వహించే కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడనున్నారు.