byసూర్య | Wed, May 01, 2024, 10:12 AM
మరికల్ మండలంలో బీజేపీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉదయం సాయంత్రం సమయాల్లో ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. బుధవారం మరికల్ మండల కేంద్రంలోని 245 భూత్ పరిధిలో ఇంటింటి ప్రచారం చేసినట్లు నాయకులు నిఖిల్ తెలిపారు. అభివృద్ధికి అండగా నిలబడాలని, ఎంపీగా డీకే అరుణ ను గెలిపించాలని కోరారు. పేదల సంక్షేమం ప్రధాని మోడీతో సాధ్యమని, మళ్లీ ప్రధానిగా గెలిపించాలని కోరారు.