ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు

byసూర్య | Wed, Apr 24, 2024, 03:15 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు అయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీన మోదీ రాష్ట్రానికి రానున్నారు.పర్యటనలో భాగంగా ఆందోల్ నియోజకవర్గానికి వెళ్లనున్న మోదీ అక్కడ బీజేపీ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు.అనంతరం వచ్చే నెల 3, 4 తేదీల్లోనూ ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో నారాయణపేట్, చేవెళ్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు మోదీ హాజరవుతారు. అయితే రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని కమలదళం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని సమాచారం.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM