ఓటమి కూడా మంచిదే.. జీవన్ రెడ్డిని కేంద్ర మంత్రిని చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

byసూర్య | Mon, Apr 22, 2024, 08:01 PM

ఓటమి కూడా అప్పుడప్పుడు మంచే చేస్తుంది.. గెలుపునకు పునాది వేస్తుందంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాను 2018 ఎన్నికల్లో ఓడిపోయినందుకే.. మాల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని అకర్షించి... పీసీసీ చీఫ్ అయ్యానని ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయ్యానంటూ రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రస్తుతం నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారని ఇప్పుడు ఎంపీగా గెలవబోతున్నారని జోస్యం చెప్పుకొచ్చారు. నిజామాబాద్ ప్రజలు జీవన్ రెడ్డిని గెలిపిస్తే ఆయన్ని కేంద్రంలో వ్యవసాయ శాఖమంత్రిని చేసే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.


పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తనకు నిజామాబాద్ అంటే ప్రత్యేక అభిమానమని చెప్పుకొచ్చారు. నిజమాబాద్‌లో గెలిచి పార్లమెంట్‌లో మాట్లాడాలని.. ఈ ప్రాంతంలో పసుసు బోర్డును, చెక్కర కర్మాగారాన్ని తెరిపించాలని, ఈ ప్రాంత రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించాలని జీవన్ రెడ్డి తనతో చెప్పినట్టు రేవంత్ రెడ్డి వివరించారు.


ఈ ఎన్నికల్లో ఇండియా కూటమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. జైపాల్ రెడ్డి, పీవీ నర్సింహరావు ఈ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉండి వారి పదవులకే వన్నె తెచ్చారని.. ఈ ప్రాంతానికి, దేశానికి గౌరవం తీసుకొచ్చారని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి కేవలం వ్యవసాయం గురించి మాట్లాడటమే కాదు.. ఆయనే స్వయంగా 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎంత రాజకీయం చేసినా.. రోజూ రాత్రి ఊరికి వెళ్లి.. పొద్దున్నే పోలంలో దిగి వ్యవసాయం చేస్తారని.. ఆయనకంటే ఎక్కువగా వ్యవసాయం గురించి తెలిసినవారు ఎవరుంటారంటూ చెప్పుకొచ్చారు. అందుకే నిజమాబాద్‌లో జీవన్ రెడ్డిని గెలిపిస్తే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలను ఒప్పించి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పదవి తీసుకొస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.


సెప్టెంబర్ 17లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కమిటీ వేశామన్నారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్‌ రైతులను పట్టించుకోలేదన్నారు. వందరోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయిస్తానని చేయలేదని, పసుపు బోర్టు తేలేదని విమర్శించారు. కవిత ఓటమి తర్వాత పీనుగులను తినే వ్యక్తి వచ్చాడంటూ అర్వింద్‌పై సీఎం మండిపడ్డారు. పసుపు బోర్డు పేరుతో అర్వింద్ ప్రజలను మోసం చేసిండన్నారు. పసుపు బోర్డుపై ప్రధాని మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా నిజామాబాద్‌ పేరు లేదన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM