byసూర్య | Mon, Apr 22, 2024, 01:55 PM
నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గెలుపు కోసం 20వ, 18వ వార్డులో సోమవారం పట్టణ సహ ఇన్చార్జి నడికుడి నవీన్, యస్సీ మోర్చ టౌన్ అధ్యక్షుడు చినేని జాని ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు ఏర్పుల నరేష్, శైలజ తదితరులు పాల్గొన్నారు.