byసూర్య | Mon, Apr 22, 2024, 01:54 PM
గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జిల్లా అధ్యక్షుడుగా ఎన్నికైన బెందె నాగభూషణంను సోమవారం గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమంలో ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ, గౌడ కుల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరు కలిసి రావాలని, గౌడ కుల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి ఉమ్మెంతల దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మేకల పోశం పాల్గోన్నారు.