byసూర్య | Mon, Apr 22, 2024, 01:53 PM
దేశానికి ప్రధానమంత్రిగా మోదీని మూడవసారి గెలిపించాలని బీజేపీ జిల్లా నాయకులు, వార్డు ఇంచార్జ్ చలపతి అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని 8వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. దేశంలో మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ను గెలిపించాలని కోరారు. రాష్ట్రానికి వేలకోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చాయని, బిజెపి పార్టీని ఆదరించాలని కోరారు.