byసూర్య | Mon, Apr 22, 2024, 01:43 PM
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పరిధిలోని తిప్పారెడ్డిపల్లి గ్రామంలో శనివారం రాత్రి దొంగతనం జరిగింది. పిట్టల రాములు అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి పిట్టల రాములు కూతురు మునియమ్మకు చెందిన 80 తులాల వెండి, మూడు తులాల బంగారం, లక్షా నలభై వేలు దోచుకు వెళ్లారు. దొంగతనం కేసును చేదించడానికి క్లూస్ టీమ్ ను రప్పిస్తున్నామని వంగూరు ఎస్ఐ మహేందర్ సోమవారం తెలిపారు.