byసూర్య | Sun, Apr 21, 2024, 04:07 PM
దేశంలో మూడోసారి మోడీకి మద్దతు ఇవ్వాలని కామేపల్లి మండల పరిధిలోనే జాస్తిపల్లిలో ఆదివారం ఖమ్మం కార్పొరేటర్ సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి మోడీ అభివృద్ధిని గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. మోడీకి మద్దతు ఇవ్వాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. సీతారాం నాయక్ ను పార్లమెంటుకు పంపించి మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.