byసూర్య | Sun, Apr 21, 2024, 03:08 PM
ప్రధాని మోదీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని నలగొండ బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ పట్టణంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో మహిళా శక్తి సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మహిళల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేశారని తెలిపారు.