byసూర్య | Fri, Apr 19, 2024, 01:40 PM
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరును పెంచారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేశ్ గురువారం ఉదయం రెజిమెంటల్ బజార్లో ప్రచారం చేశారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి వీధిలో పాదయాత్ర చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డీబీ దేవేందర్, గౌరీ శంకర్, నందికంటి రవితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.