byసూర్య | Fri, Apr 19, 2024, 01:40 PM
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని మేయర్ నివాసంలో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డిని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసిన సాయి అనురాగ్ కాలనీ సభ్యులు శంకర్ రావు, జనార్ధన్ కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ జగదాంబా త్రిశక్తి పీఠం విజయ కనక దుర్గా దేవస్థానం అష్టమ వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరు కావాలని కోరారు.