byసూర్య | Fri, Apr 19, 2024, 01:38 PM
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా భువనగిరి పార్లమెంటు పరిధిలోని కట్టంగూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శుక్రవారం ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.