byసూర్య | Thu, May 02, 2024, 01:56 PM
మళ్ళీ నరేంద్ర మోడీనే అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేటలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గల్లి నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరి మనసులో నరేంద్ర మోడీ ఉన్నారన్నారు. 600 సంవత్సరాల నుంచి అయోధ్య రాముడికి అయోధ్యలో ఇల్లు లేకుండా ఉంటే ఈరోజు అదే ఇంటిని కట్టించి పెద్ద రామాలయం నిర్మాణం చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో అందరు ముఖ్యమంత్రి అభ్యర్థులే ప్రజలను మోసం చేసి ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్కటినీ అమలు చేయలే కావున నల్లగొండ వారసత్వ రాజకీయాలు బొంద పెట్టాలని ప్రజలను కోరారు.