byసూర్య | Thu, May 02, 2024, 04:30 PM
మరికల్ మండలంలోని గాజులయ్య తాండా, బండ తాండా, బుడ్డగాని తాండా, నర్వ మండలంలోని జంగంరెడ్డి తాండాలలో గురువారం తనిఖీలు చేసినట్లు ఎక్సైజ్ సిఐ అశోక్ కుమార్ తెలిపారు. తనిఖీల్లో 6 లీటర్ల సారాయి, 2, 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా నాటు సారా తయారు చేస్తున్న, విక్రయిస్తున్న సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలన్నారు.