byసూర్య | Fri, Apr 19, 2024, 02:21 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జయరాం నగర్, ప్రశాంత్ నగర్ కాలనీలలో శుక్రవారం మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కేపీ. వివేకానందా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మతం పేరుతో బిజెపి రాజకీయాలు చేస్తుంటే, మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ నీచమైన రాజకీయాలు చేస్తున్నాయి అన్నారు.