byసూర్య | Fri, Apr 19, 2024, 10:14 AM
భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్లకు మోసపోయాడు. ఓ యాప్ లో ఐఫోన్ ఆఫర్ ఉందంటూ నమ్మబలికి అతని నుండి సైబర్ నేరగాళ్లు 25 వేలు కాజేశారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే 1930 కి ఫోన్ చేసి సమాచారం అందించి ఫిర్యాదు చేయాలని గురువారం భువనగిరి రూరల్ ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు