రేవంత్ రెడ్డి సమర్థుడు.. ఫ్రెండ్‌గా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నా: ధర్మపురి అర్వింద్

byసూర్య | Mon, Apr 15, 2024, 07:40 PM

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఒకటి, రెండు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశాయి. ఇక గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. సభలు, రోడ్ కార్నర్ మీటింగులు, మీడియా సమావేశాల్లో చాలా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి బీజేపీ అర్వింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


రేవంత్ రెడ్డి సమర్థుడైన నాయకుడు అని అర్వింద్ అన్నారు. ఒక ఫ్రెండ్‌గా రేవంత్‌ను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాని చెప్పారు. కాంగ్రెస్ పాలనను తాను మెచ్చుకోవటం లేదని.. కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే సమర్థవంతమై నేత అని కొనియాడారు. రేవంత్ ఒకవేళ బీజేపీలోకి వస్తానంటే.. స్నేహితుడిగా ఆహ్వానిస్తానని అన్నారు. ఆయన వస్తే తీసుకోవాల్నా వద్దా అనే విషయాన్ని తమ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిసైడ్ చేస్తారని చెప్పారు.


రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్ పర్సన్ అని.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే మాత్రం అసమర్థుడిగా తయారయ్యే ఛాన్స్ ఉందని అర్వింద్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోని నేతలు ఆయన్ను పని చేయనివ్వరని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే 15 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని చెప్పారు. ఫ్రెండ్‌గా మాత్రమే బీజేపీలోకి ఆహ్వానిస్తున్నానని.. తుది నిర్ణయం అధిష్టానిదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే ఎఫిసియన్సీ తగ్గి ఫైనల్‌గా రాజ్‌పాల్ యాదవే అవుతారని వెల్లడించారు. అక్కడే ఉండి సమర్థత కోల్పోవద్దని సూచించారు. ఇక రైతుబంధు నిధులపై కూడా అర్వింద్ స్పందించారు. రైతులకు రైతుబంధు కూడా సరిగ్గా ఇవ్వటం లేదన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు నిధులు మిగిల్చిపోతే.. ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన మంత్రులు ఎత్తుకెళ్లిపోయారని ఆరోపించారు.


Latest News
 

ఏఐ అంటే రేవంత్ రెడ్డి ఎనుముల ఇంటెలిజెన్స్ : కేటీఆర్ Mon, Oct 21, 2024, 10:47 AM
తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Mon, Oct 21, 2024, 10:22 AM
మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM