రేషన్‌కార్డు ఉన్నవారికి అలర్ట్.. మరో అవకాశం కల్పించిన సర్కార్, వెంటనే చేసేయండి

byసూర్య | Mon, Apr 15, 2024, 07:44 PM

సంక్షేమ పథకాలు అర్హులకే అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. ప్రధానంగా పేదలకు అందాల్సిన రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా అర్హులకే అందే విధంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే రేషన్‌ కార్డులకు ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. దీని కోసం అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టారు. అందుబాటులో ఉన్న రేషన్‌ దుకాణాలకు వెళ్లి ఈ-కేవైసీ చేసుకోవాలని పౌరసరఫరాల అధికారులు ప్రజలకు సూచించారు. వేలి ముద్రల ఆధారంగా కుటుంబంలో సభ్యుడా? కాదా? అనే విషయాలను ఈ కేవైసీ ద్వారా గుర్తించనున్నారు. తద్వారా రేషన్ బియ్యం సహా సరుకులు సక్రమంగా అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.


ఈ కేవైసీ ఎప్పట్నుంచో చేస్తున్నా.. వేలిముద్రలు పడక, సాంకేతిక సమస్యలతో జాప్యం జరుగుతోంది. చిన్నారుల ఆధార్‌ అప్డేట్ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలువురు వృద్ధుల వేలిముద్రలు పడడం లేదు. మీసేవా, ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి అప్టేట్ పూర్తి చేసుకున్నా ఈ-కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడం లేదు. వలస వెళ్లిన వారి కోసం అక్కడ ఉండే రేషన్‌ షాపుల్లో ఈ-కేవైసీ చేసుకునే వెసులుబాటు ఉన్నా.. కొందరు డీలర్లు తమ పరిధిలోని వారికే ఈ కేవైసీ ప్రక్రియను చేస్తున్నారు. జిల్లాలో పలు చోట్ల రేషన్‌ డీలర్లు ఈ-కేవైసీ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా చాలా మంది ఇప్పటికి ఈ కేవేసీ పూర్తి చేసుకోలేదు. లబ్ధిదారుల్లో 74.6 శాతం మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.


ఈ నేపథ్యంలో రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికి.. రేషన్‌ దుకాణాల్లో ఈ-కేవైసీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. రేషన్‌ డీలర్ల వద్దకు వెళ్లి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సివిల్ సప్లయ్ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం తుది గడువు విధించలేదని.. విధించేలోపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు.


Latest News
 

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం Mon, Oct 21, 2024, 01:05 PM
పోలీసు అమరవీరుల త్యాగనిరతి చిరస్మరణీయం Mon, Oct 21, 2024, 01:02 PM
ఎంపీకి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 01:01 PM
కేటీఆర్ నివాసం వ‌ద్ద పోలీస్ బందోబ‌స్తు.. Mon, Oct 21, 2024, 12:54 PM
నేటి నుంచే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు Mon, Oct 21, 2024, 12:20 PM