భద్రాద్రి రామయ్య కల్యాణం.. సీతమ్మకు సిరిసిల్ల నేతన్న అరుదైన కానుక

byసూర్య | Mon, Apr 15, 2024, 07:24 PM

శ్రీరామ నవమి సందర్భంగా ఈనెల 17 భద్రాచలంలో రామయ్య కల్యాణోత్సవం జరగనుంది. ఈ వేడుకకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రామయ్య, సీతమ్మలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వెళతారు. విలువైన కానుకలను స్వామి, అమ్మవార్లకు సమర్పిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ సీతమ్మవారి కోసం అరుదైన చీరను తయారు చేశారు.రంగులు మారే త్రీడీ చీరను రూపొందించారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న ఈ చీర బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో తయారు చేసినట్లు విజయ్ తెలిపారు. ఇందుకు రూ.48 వేలు ఖర్చయిందని.. ఈ నెల 16న చీరను భద్రాచలం సీతమ్మకు కానుకగా అందించనున్నట్లు వెల్లడించారు.


ఇక సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల నుండి సీతమ్మకు పెండ్లి చీర వెళ్లనుంది. ప్రతి సంవత్సరం కళ్యాణానికి చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఆనవాయితీగా చీరను పంపిస్తున్నాడు. ఈసారి తన చేనేత నైపుణ్యాన్ని ఉపయోగించి చేనేత మగ్గంపై సీత రాముల కళ్యాణం జరిగే తీరు, చీర అంచులో భద్రాద్రి దేవాయాయంలో ఉన్న సీతారాముల ప్రతిరూపాలు వచ్చే విధంగా చీరను నేశాడు. చీర మొత్తం శంకు, చక్ర నామాలతో పాటు బార్డర్‌లో జైశ్రీరామ్ అనే అక్షరాలు వచ్చే విధంగా చీరను తయారు చేశాడు.


ఆరు రోజుల పాటు శ్రమించి ఈ చీరను తయారు చేసినట్లు హరిప్రసాద్ వెల్లడించారు. ఈ చీర బరువు 800 గ్రాములు ఉండగా, ఇందులో రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టు దారాలు ఉపయోగించినట్లు చెప్పారు. చీర కొంగులో సీతారాముల కళ్యాణం బొమ్మని నేయడం ఈ చీర విశేషమన్నారు. ఈ చీరను నేడు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చూపించి, ఆ తర్వాత భద్రాద్రి దేవస్థానానికి అందిస్తానని హరిప్రసాద్ తెలిపాడు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM