byసూర్య | Sun, Apr 14, 2024, 09:08 PM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు విధించిన సంగతి తెలిసిందే. కాగా, కస్టడీ సమయంలో సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కవిత తన లాయర్తో 30 నిమిషాలు, కుటుంబ సభ్యులతో 15 నిమిషాలు మాట్లాడేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో కవితను కలిసేందుకు కేటీఆర్, కవిత తరఫు లాయర్ మోహిత్ రావు, కవిత భర్త అనిల్ కుమార్ ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. కవితను కలిసిన కేటీఆర్ ఆమెకు ధైర్యం చెప్పారు.