తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు, అన్నదాతల్లో ఆందోళన

byసూర్య | Sun, Apr 14, 2024, 05:29 PM

తెలంగాణ వాతావరణంలో అనుహ్యంగా మార్పులు వచ్చాయి. మెున్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. గత రెండ్రోజులుగా వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు వస్తాయని.., గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.


నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, మెదక్, జగిత్యాల, సంగారెడ్డి, ములుగు, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత హైదరాబాద్ పరిసరాలకు మేఘాలు వస్తాయని.. సాయంత్రం 6 తర్వాత దక్షిణ తెలంగాణపై మేఘాలు కమ్ముకుంటాయన్నారు.


ఇక శనివారం మెదక్‌, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం చిన్నమావందిలో 40.3 మి.మీ వర్షం కురిసింది. అకాల వర్షాలతో జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దవడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.



Latest News
 

అన్ని రంగాల్లో ముది రాజ్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది : బండ ప్రకాశ్ ముదిరాజ్ Tue, Mar 25, 2025, 08:59 PM
భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ. 20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ Tue, Mar 25, 2025, 08:58 PM
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 25, 2025, 08:43 PM
గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మద్యం ఆదాయం ఎలా పెంచిందో అందరికీ తెలుసు : మంత్రి జూపల్లి Tue, Mar 25, 2025, 08:40 PM
బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన కలెక్టర్ Tue, Mar 25, 2025, 08:20 PM