byసూర్య | Sat, Apr 13, 2024, 02:18 PM
విద్యార్థులు కామ్రేడ్ జార్జి రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన బాటలో నడవాలని పి డీ ఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ అన్నారు. శనివారం నారాయణపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జార్జి రెడ్డి 62వ వర్దంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జార్జి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 1972 లో సరిగ్గా ఇదే రోజు మతోన్మాదుల చేతిలో జార్జి రెడ్డి దారుణ హత్యకు గురయ్యారని గుర్తు చేశారు.