byసూర్య | Sat, Apr 13, 2024, 02:16 PM
శిశుమందిర్ పాఠశాలలు సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు అని ప్రధానాచార్యులు దత్తు చౌదరి అన్నారు. శనివారం నారాయణపేట సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. వారి నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు. ప్రధానాచార్యులు మాట్లాడుతూ.. విద్యార్థులకు అందుతున్న విద్య, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి విద్యను అందిస్తున్నామని అన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.